ఛేదనలో కోహ్లీ ఎలా ఆడతాడో చూశాం
"ఛేదనలో కోహ్లీ ఎలా ఆడతాడో ఇప్పటికే చాలాసార్లు చూశాం. సిడ్నీలో మరోసారి చూపించాడు. టీ20లతో పోలిస్తే టెస్టులు భిన్నం. దీంతో పాటు ఆసీస్ జట్టులో నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్ నాథన్ లియాన్ ఉన్నాడు. కాబట్టి, టెస్టుల్లో కోహ్లీ పరుగులు చేయకుండా కట్టడి చేస్తాం" అని అలెక్స్ అన్నాడు.
20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు
ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (33), ఫించ్ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్ (25 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.
డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు
ఓపెనర్ శిఖర్ ధావన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23), దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 22 నాటౌట్) రాణించారు. ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్