

హైదరాబాద్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం 16 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో చోటు కోల్పోయిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మళ్లీ వన్డే, టీ20 జట్టులో భారత సెలక్టర్లు చోటు కల్పించారు.
దీంతో మూడు నెలల తర్వాత మళ్లీ భారత్ తరఫున ధోనీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు ఆసియా కప్లో గాయపడిన హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరిస్తో పునరాగమనం చేయనున్నాడు. దినేశ్ కార్తీక్ వన్డే, టీ20 జట్టులో రెండో వికెట్ కీపర్గా తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. రిషబ్ పంత్ మాత్రం కేవలం టీ20లకే అవకాశమిచ్చారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో తలపడే భారత్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ
న్యూజిలాండ్తో టీ20 సిరిస్కు భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్