ధోని కోసం పంత్ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు
ఈ వరల్డ్కప్లో ధోని కోసం పంత్ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై షేన్ వార్న్ సరైన వివరణే ఇచ్చాడు. వరల్డ్కప్ 1992లో భాగంగా న్యూజిలాండ్ ఓపెనర్లను మార్చిందని, అదేవిధంగా తొలి ఓవర్ను స్పిన్నర్తో బౌలింగ్ వేయించి సక్సెస్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు.
మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి
ఇలాంటి మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి గురవుతుందని అన్నాడు. ఇలాంటి విభిన్న మార్పులతోనే టీమిండియా బరిలోకి దిగితే తప్పక విజయం సాధిస్తుందని వార్న్ అన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లోనే పంత్ను ఓపెనర్గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. భవిష్యత్ క్రికెట్ పంత్దే అంటూ కితాబిచ్చాడు.
పంత్కు చోటు లభిస్తుందా అన్న చర్చ
"పంత్కు చోటు లభిస్తుందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి ధోనితో పాటు పంత్నూ జట్టులోకి తీసుకోవచ్చు. పంత్ అసాధారణ ఆటగాడు. అతడిని ప్రధాన బ్యాట్స్మన్గా ఎంపిక చేయొచ్చు. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా కూడా పంపొచ్చు. ఆ బాధ్యతను ధావన్ గొప్పగా నిర్వర్తిస్తుండొచ్చు" అని చెప్పుకొచ్చాడు.
పంత్, రోహిత్ ఓపెనింగ్ చేస్తే భారత్కు మంచి జరుగుతుంది
"పంత్, రోహిత్ ఓపెనింగ్ చేస్తే భారత్కు మంచి జరుగుతుంది. ఇలా భిన్నమైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను దెబ్బతీసే అవకాశం భారత్కు ఉంది. టాప్ ఆర్డర్లో రాణించగల నైపుణ్యం పంత్ సొంతం. ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో టీమిండియా ప్రయోగాలు చేయాలి'' అని వార్న్ వివరించాడు. ఇక బౌలింగ్లోనూ టీమిండియా ఎప్పుడూ లేనివిధంగా బలంగా ఉందన్నాడు. సుదీర్ఘ కాలం ప్రపంచ క్రికెట్ను శాసించగల సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉందని వార్న్ చెప్పాడు.