నాలుగో వన్డేలో ధోని
దీంతో నాలుగో వన్డేలో ధోనికి జట్టు మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో కెప్టెన్గా రోహిత్ శర్మని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు అండగా మైదానంలో ధోని ఉండటం ముఖ్యమని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.
నాలుగు క్యాచ్లు అందుకున్న కార్తీక్
మరోవైపు మూడో వన్డేలో నాలుగు క్యాచ్లు అందుకున్న దినేశ్ కార్తీక్ బ్యాటింగ్లో 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 38 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతోనాలుగో వన్డేకి దినేశ్ కార్తీక్పై వేటు వేయాలా? లేక కొనసాగించాలా? అని జట్టు మేనేజ్మెంట్ ఆలోచన చేస్తోంది.
కోహ్లీకి విశ్రాంతి
మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చివరి రెండు వన్డేలతో పాటు ఫిబ్రవరి 6 నుంచి జరిగే మూడు వన్డేల సిరిస్కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్కి అవకాశమివ్వాలని గంగూలీ లాంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. తుది జట్టులో చోటుకు గిల్ అర్హుడని గంగూలీ చెప్పాడు.
కోహ్లీ స్థానంలో గిల్
దీంతో గురువారం నాలుగో వన్డేలో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో గురువారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే తుది జట్టు ఎలా ఉండబోతుంది? అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత పేసర్లు భువనేశ్వర్, మహ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికీ విశ్రాంతినిచ్చి.. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా మేనేజ్మెంట్ చర్చిస్తోంది.