సేమ్ టూ సేమ్ ఆడతాం
ఇకపోతే ఈ మ్యాచ్కు ముందు టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము ఛేజింగ్ బాగా చేయగలం. వికెట్ ఎలా ఉందో ముందుగా బౌలింగ్ వేస్తే అవగాహన వస్తుంది. ఇంత త్వరగా కొత్త జట్టుతో మరో టెస్ట్ ఆడడం బాగుంది. మా మూమెంటం రోలింగ్ను కొనసాగించడానికి మాకు ఇది అవకాశాన్ని ఇస్తుంది. మేము న్యూజిలాండ్తో ఎలా ఆడామో అలాగే ఆడతాం అని స్టోక్స్ పేర్కొన్నాడు.
నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి..
టాస్ ఓడిన జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. కెప్టెన్గా ఓ గొప్ప అనుభూతి ఉంది. ఇది నాకో పెద్ద విశేషం. మా ప్రిపరేషన్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. టీ20ల నుంచి తిరిగి వచ్చినందున ఎక్కువ సమయం వెచ్చించాలని, ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడాలని అనుకున్నా. మా సైడ్ నుంచి నలుగురు పేసర్లను బరిలోకి దించుతున్నాను. నేను, సిరాజ్, శార్దూల్ షమీ ఈ మ్యాచ్లో ఆడతారు. జడేజా ఆల్రౌండర్గా ఆడనున్నాడు. ఇక అందరూ ఊహించినట్లే రవిచంద్రన్ అశ్విన్కు బదులు నాలుగో పేసర్ను ఆడించడమే మేలని ఇండియా భావించింది. ఇక నలుగురు స్పెషలిస్టు బౌలర్లు బరిలోకి దిగనుండడం మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్