ధోనీ చివరి వరకు ఉంటే
"ధోనీ చివరి వరకు ఉంటే ఏం చేయగలడో అందరికీ తెలుసు. అతడు ఒక్క రోజు విఫలమైనా అంతా అతడిపై విమర్శలు చేస్తారు. మేము మాత్రం మద్దతుగా ఉంటాం. భారత్కు అతడు ఎన్నో విజయాలు అందించాడు. టెయిలెండర్స్తో కలిసి ఎలా బ్యాటింగ్ చేయాలో మహీకంటే బాగా ఎవరికీ తెలియదు" అని కోహ్లీ అన్నాడు.
పదికి ఎనిమిది సార్లు అతడిచ్చిన
"పదికి ఎనిమిది సార్లు అతడిచ్చిన సలహాలు పనిచేస్తాయంటే జట్టులో అతడెంత కీలక సభ్యుడో అర్థం చేసుకోవచ్చు. ఎంత స్కోరు చేస్తే సరిపోతుందో అతడు కచ్చితంగా చెప్పగలడు. అతడు 265 పరుగులు సరిపోతాయంటే మేమేం 300 కోసం ఆడం. అలాగని 230తో సరిపెట్టుకోం. అతడు క్రికెట్ దిగ్గజం అన్న సంగతి మాకు తెలుసు" ధోనికి మద్దతుగా నిలిచాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 72(8ఫోర్లు), ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... చివర్లో హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 46(5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.
34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలిన విండిస్
అనంతరం టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచకప్లో వెస్టిండిస్ ఇది మూడో అతి పెద్ద ఓటమి కావడం విశేషం. భారత బౌలర్లు మహ్మద్ షమీ, బుమ్రా, చాహల్ బౌలింగ్ ముందు కరీబియన్లు నిలవలేకపోయారు. ఏ దశలోనూ కోహ్లీసేనకు పోటీ ఇవ్వలేకపోయారు. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
నాలుగు వికెట్లతో చెలరేగిన షమీ
ఆ తర్వాత నికోలస్ పూరన్(28), హెట్మెయిర్(18) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో షమీ నాలుగు... బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. తాజా విజయంతో టీమిండియా సెమీస్కు చేరుకోగా, విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజా విజయంతో భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కోహ్లీ నిలిచాడు.