టాప్ లేపిన రోహిత్
రాంచీ టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్.. ఆ టెస్టులో డబుల్ సెంచరీ చేయడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి.. 722 పాయింట్లతో 10వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇది రోహిత్కు అత్యున్నత ర్యాంకు. ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్ 10లో నిలిచిన రెండో బ్యాట్స్మన్గా రోహిత్ నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్-10లో కొనసాగుతున్నాడు.
కెరీర్ అత్యుత్తమ ర్యాంకులో రహానే
పుణే టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఆగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు కోహ్లీకి మధ్య పాయింట్ల (11) వ్యత్యాసం పెరిగింది. టెస్టు బ్యాట్స్మన్ చటేశ్వర పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రాంచీ టెస్టులో సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే కెరీర్లో అత్యుత్తమ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత బ్యాట్స్మన్ టాప్-10లో నలుగురు ఉండటం విశేషం. మయాంక్ అగర్వాల్కు 18 ర్యాంకు దక్కింది.
నాలుగో స్థానానికి పడిపోయిన బుమ్రా
బౌలర్ల ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన జస్ప్రిత్ బుమ్రా మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ 10వ ర్యాంకు దక్కించుకున్నాడు. బుమ్రా, అశ్విన్ మినహా భారత బౌలర్లు ఎవరూ టాప్ 10లో లేరు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలు 14, 15 స్థానాలలో కొనసాగుతున్నారు. ఉమేష్ యాదవ్ 24వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్రౌండర్స్ జాబితాలో హోల్డర్, రవీంద్ర జడేజా, షకీబుల్ హసన్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఆగ్రస్థానంలో టీమిండియా
దక్షిణాఫ్రికా జట్టును 3-0తో వైట్వాష్ చేయడంతో టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్తానానికి మరింత బలం చేకూరింది. 119 రేటింగ్ పాయింట్లతో టీమిండియా ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాలలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.