ధోని రనౌట్
జడేజా 59 బంతుల్లో 77 పరుగులు చేసి పెవిలియన్కు చేరగా... ఆ తర్వాత ధోని (72 బంతుల్లో 50) దూకుడుగా ఆడే క్రమంలో మార్టిన్ గుప్టిల్ రనౌట్కు బలయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోని ఔటై పెవిలియన్కు చేరే క్రమంలో యజువేంద్ర చాహల్ క్రీజులోకి వెళ్లాడు. తాజాగా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
చాహల్ మాట్లాడుతూ
చాహల్ మాట్లాడుతూ "ఇది నాకు తొలి వరల్డ్కప్. మహీ భాయ్(ధోని) ఔటై పెవిలియన్కు చేరే క్రమంలో నేను బ్యాటింగ్కు వెళ్తున్నాను. ఆ సమయంలో నా కళ్ల వెంట వస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించా. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. టోర్నీలో వరుసగా 9 మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడి ఆఖర్లో నిష్క్రమించాం" అని తెలిపాడు.
వర్షం మన చేతుల్లో లేదు
"వర్షం మన చేతుల్లో లేదు కాబట్టి ఏమీ చెప్పడం సరైనది కాదు(అంతరాయం గురించి). మైదానం నుంచి వీలైనంత త్వరగా తిరిగి హోటల్కు తిరిగి వెళ్లాలని మేము కోరుకోవడం ఇదే మొదటిసారి. నేను 5-6 సంవత్సరాలు కొనసాగించాలనుకుంటున్నాను. నేను కనీసం ఒక ప్రపంచ కప్ గెలవాలనుకుంటున్నాను" అని చాహల్ తెలిపాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిస్తే
"నేను ఆడుతున్న విధానం, మా జట్టు ప్రస్తుతం ఎలా రూపాంతరం చెందుతుంతో... అదొక సానుకూల సంకేతం. మేము న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్లలో గెలిచాము. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిస్తే, విమర్శలన్నీ ఆగుతాయి" అని చాహల్ చెప్పుకొచ్చాడు. వెస్టిండిస్ పర్యటనతో పాటు స్వదేశంలో సఫారీలతో జరిగిన టీ20 సిరిస్కు చాహల్ ఎంపిక కాలేదు.