GOAT డిబేట్ విషయంలో
ఈ GOAT డిబేట్ విషయంలో అభిమానులు సైతం చీలిపోయారు. అసలు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్తో వీరిద్దరికి పోలికేంటని ఇంకొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్? అని జరుగుతున్న చర్చ విషయమై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే స్పందించాడు.
జయవర్దనే మాట్లాడుతూ
జయవర్దనే మాట్లాడుతూ "సచిన్ ఆటను చూస్తూం పెరిగాం. గతంలో సచిన్ కూడా ఇలాగే ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. కొంత కాలం ధోనీ ఈ భారాన్ని మోశాడు. తర్వాతి తరానికి ఈ బాధ్యత కోహ్లీ భుజస్కంధాలపై ఉంది" అని అన్నాడు.
ఒత్తిడిని తట్టుకునే విరాట్ కోహ్లీ
"ఒత్తిడిని తట్టుకునే విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలవాలని భారత అభిమానులను కోరుకుంటారు. కెప్టెన్గా ఉండటం అంత తేలికేం కాదు. మైదానంలో కెప్టెన్ బాధ్యతగా ఎలా ఉండాలో కోహ్లీ అర్థం చేసుకున్నాడు" అని జయవర్దనే తెలిపాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించాడు.
కోహ్లీతో ప్రస్తుత తరంలోని ఆటగాళ్లనెవర్నీ పోల్చలేం
అటు కెప్టెన్సీలో, ఇటు బ్యాటింగ్లో సత్తా చాటుతున్న అతడితో ప్రస్తుత తరంలోని ఆటగాళ్లనెవర్నీ పోల్చలేమని జయవర్దనే స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఏకైక అత్యుత్తమ క్రికెటర్గా కాకున్నా.. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కోహ్లీ నిలుస్తాడని జయవర్దనే చెప్పుకొచ్చాడు.