|
నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాం
అయితే ఈ ట్వీట్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన పలువురు క్రికెట్ అభిమానులు ఈ ట్వీట్పై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. "గంభీర్ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
|
నిషేధంపై క్లీన్చీట్ ఇచ్చిన విషయం తెలియదా?
మరొక నెటిజన్ హైకోర్టు అజహరుద్దీన్పై విధించిన నిషేధంపై క్లీన్చీట్ ఇచ్చిన విషయం తెలియదా? ప్రశ్నించాడు. మ్యాచ్ ఫిక్సింగ్లో పాలుపంచుకున్నందుకు అజహర్కు బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఇంకొక నెటిజన అయితే అజహరుద్దీన్ ఎంపీ కూడా అయ్యారని ట్వీట్ పెట్టాడు.
2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధం
భారత్ తరపున 99 టెస్టులు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్పై 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేదం విధించింది. అయితే, బీసీసీఐ విధించిన నిషేధంపై అజహరుద్దీన్ హైకోర్టుని ఆశ్రయించడంతో 2012లో హైకోర్టు అతడిపై నిషేధం ఎత్తివేసింది. అప్పటి నుంచి అజహరుద్దీన్ క్రికెట్ తరహా అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకుంటున్నాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సైతం
గతేడాది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సైతం పోటీ చేసాడు. నిషేదం ఎత్తివేతపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తర్వాత అజహరుద్దీన్ను అన్ని క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది.
ఈడెన్లో తొలి సెంచరీని సాధించిన అజహరుద్దీన్
దీంతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20కు ముందు గంట మోగించాడు. తన తొలి టెస్టు మ్యాచ్ను ఇదే స్టేడియంలో ఆడి సెంచరీ చేసిన అజహరుద్దీన్ ఆ తర్వాత ఆడిన మరో 6 టెస్టుల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీని (74 బంతుల్లో) అజహర్ 1996లో దక్షిణాఫ్రికాపై ఈడెన్లోనే సాధించాడు.