రెండు నెలలు ఆర్మీకి సేవలు
ఈ రెండు నెలలు ఆర్మీకి సేవలు అందించనున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిని ధోని పేరొన్నట్లు ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ సైతం అధికారికంగా ద్రుృవీకరించింది. ఈ రెండు నెలలు ధోని పారాచూట్ రెజిమెంట్ విభాగంలో చేరి దేశ సైనికుడిగా సేవలందిస్తుడాని తెలిపింది.
బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ
ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "ధోని తనకు తానుగా వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్లో చేరి సేవలందిస్తాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదు" అని అన్నారు. విండిస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు ఆదివారం సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.
ఈ సమావేశానికి ముందే
ఈ సమావేశానికి ముందే ధోని ఈ విషయాన్ని వెల్లడించనట్లు ఆయన తెలిపారు. ధోని నిర్ణయాన్ని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కు తెలియజేశామని ఆయన అన్నారు. దీంతో ధోని స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను... టెస్టులకు వృద్ధిమాన్ సాహా పేరును సెలక్టర్లు పరిశీలించనున్నారు.
2015 ప్రపంచకప్ నుంచి ధోని డౌన్ ఫాల్
2015 ప్రపంచకప్ నుంచి ధోని డౌన్ ఫాల్ మొదలైంది. 2016, 2018లలో ధోని పేలవ ప్రదర్శన చేశాడు. 2016లో ధోని 10 ఇన్నింగ్స్ల్లో 27.8 యావరేజితో 278 పరుగులు చేయగా... 2018లో 13 ఇన్నింగ్స్లాడి 25 యావరేజితో 275 పరుగులు చేశాడు. ఇక, 2017లో మాత్రం 60.61 యావరేజిని నమోదు చేశాడు.
గత నాలుగేళ్లుగా
గత నాలుగేళ్లుగా ధోని ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇక, ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేసారు.