టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ను దాటిగా ప్రారంభించింది. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి (38) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. 40 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 38 పరుగులు చేసిన ధావన్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు.
— This is HUGE! (@ghanta_10) October 29, 2018 |
పావెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన పావెల్
కీమోపాల్ బౌలింగ్లో కీరన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన కీమో పాల్ బౌలింగ్లో బంతిని మిడ్వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. బంతి బ్యాట్కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పొవెల్ చేతుల్లో పడింది.
|
నాలుగో వన్డేలో తొలి వికెట్కు 3986 పరుగులు
దీంతో ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్-ధావన్ జోడి నాలుగో వన్డేలో తొలి వికెట్కు 3986 పరుగులు జోడించారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో గంభీర్-సెహ్వాగ్ జోడి ఉంది. వీరిద్దరూ తొలి వికెట్కు 1870 పరుగులు జోడించారు. నాలుగో స్థానంలో సునీల్ గావస్కర్-శ్రీకాంత్ (1680) జోడి ఉంది.
|
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ జోడీగా ధావన్-రోహిత్
ధావన్-రోహిత్లు 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ జోడీగా ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో వీరి జోడి 13 సెంచరీకి పైగా భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులతో 162 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(195 సిక్సులు) రికార్డుని సమం చేశాడు.