|
సహనంతో ఎదుర్కొని ఆసీస్కు విసుగుతెప్పించి
అలాంటి తరుణంలో క్రీజులోకి దిగి ఆసీస్ బౌలర్లను సహనంతో ఎదుర్కొని అంచనాలను అందుకున్నాడు.సెంచరీ దాటిన తర్వాత దూకుడు పెంచిన పూజారా... 246 బంతులు ఆడి 123 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాట్ కమిన్స్ చేతులమీదుగా రనౌట్కు గురైయ్యాడు. అప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు విసుగుతెప్పించిన పూజారాను అవుట్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దీంతో కమిన్స్ చేసిన రనౌట్ ఫీట్ కూడా నెట్టింట్లో వైరల్గా మారింది.
|
గౌరవప్రదమైన స్కోర్తో ముగించిన టీమిండియా
పుజారా ప్రస్తుతం ఆడుతోన్న 108వ ఇన్నింగ్స్లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్టులో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షమీ(6), బుమ్రా (0) ఉన్నారు.
|
వరుసగా వికెట్లు పడుతుంటే
జట్టు స్కోరు 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న టీమిండియా పుజారా ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో లంచ్కి ముందే నాలుగు వికెట్స్ తీసిన ఆసీస్ బౌలర్లు లంచ్ తర్వాత రోహిత్ శర్మ (37), రిషబ్ పంత్ (25) పెవిలియన్కు చేర్చారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన అశ్విన్.. పుజారాతో కలిసి భారత్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు.