షెడ్యూల్ ప్లాన్ చేసుకుందిలా:
ఆ తర్వాత మరో నాలుగు రోజుల విరామం తీసుకుని మళ్లీ వవ్డే సిరీస్ ఆడనున్న టీమిండియా అక్టోబర్ 21 నుంచి నవంబరు 1వరకూ పోరాడేందుకు సన్నద్ధమైంది. గౌహతి, ఇండోర్, పూనె, ముంబై, తిరువనంతపురంలు 50 ఓవర్లు ఫార్మాట్కు వేదిక కానున్నాయి. ఈ మ్యాచ్ల మధ్యలో కనీసం రెండు రోజుల విరామం ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.
మొదటి మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా
ఇక టీ 20విషయానికొచ్చేసరికి మొదటి మ్యాచ్ను కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఇదే వేదికగా విండీస్ జట్టు ఇంగ్లాండ్ జట్టును ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. లక్నో.. చెన్నైలు కూడా ఆ ట్రోఫీకి వేదికలయ్యాయి. ప్రస్తుతం విండీస్ క్రికెటర్లు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 1-3 తేడాతో
టీమిండియా మాత్రం ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 1-3 తేడాతో చేజార్చుకుంది. ఈ పర్యటన అనంతరం టీమిండియా ఆసియా కప్లో వన్డే మ్యాచ్లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి ఆడనుంది. విండీస్ జట్టు ఇటీవల కాలంలో భారత్ కంటే బలమైన జట్టును ఎదుర్కొన్నది లేదు. కరేబియన్ లీగ్ కంటే ముందు ఆడిన సిరీస్లో బంగ్లాదేశ్తో ఆడి టెస్టు సిరీస్ను గెలుచుకుంది. కానీ, వన్డే, టీ 20 సిరీస్లను కోల్పోయింది.
మూడు ఫార్మాట్ల పూర్తి వివరాలు.. :
టెస్టు సిరీస్:
రాజ్కోట్లో మొదటి టెస్టు 4-8 అక్టోబరు వరకూ
హైదరాబాద్లో రెండో టెస్టు 12-16 అకోబరు వరకూ
వన్డే సిరీస్:
తొలి వన్డే: అక్టోబర్ 21, గుహవాటి
రెండో వన్డే: అక్టోబర్ 24 , ఇండోర్
మూడో వన్డే: అక్టోబర్ 27,పుణె
నాల్గో వన్డే: అక్టోబర్ 29, ముంబై
ఐదో వన్డే: నవంబర్1, తిరువనంతపురం
టీ20 సిరీస్:
తొలి టీ20: నవంబర్ 4, కోల్కతా
రెండో టీ20: నవంబర్ 6, లక్నో
మూడో టీ20: నవంబర్ 11, చెన్నై