హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. వ్యూయర్షిఫ్ పరంగా కూడా ఈ మ్యాచ్ రికార్డులను నెలకొల్పుతుంది. అలాంటి మ్యాచ్ ఇరు జట్ల మధ్య మరోసారి దుబాయి వేదికగా జరగనుంది.
వన్డే వరల్డ్కప్: టికెట్ల కొనుగోలుకు ముగిసిన గడువు, ఒక్క టికెట్ మిగల్లేదు
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇరు జట్లు సెప్టెంబర్ 19(బుధవారం) తలపడనున్నాయి. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయికి చేరుకున్నాయి. దుబాయికి చేరుకున్న వెంటనే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనితో పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కరచాలనం చేశాడు. అంతేకాదు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#WATCH: Mahendra Singh Dhoni and Shoaib Malik meet during practice in Dubai ahead of #AsiaCup2018. India and Pakistan to play each other on September 19. pic.twitter.com/KGchi5qilJ
— ANI (@ANI) September 14, 2018
శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.
హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో క్వాలిఫయిర్తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది. సెప్టెంబర్ 15(శనివారం) టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
ఆసియా కప్లో నమోదైన రికార్డులు: తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు
గత ఆసియా కప్ టోర్నీని తొలిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.
ఆసియా కప్ టోర్నీ సందర్భంగా శుక్రవారం ఆరు దేశాల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 19వ తేదీన పాకిస్థాన్తో భారత్ తలపడనున్నది. ఆ మ్యాచ్పైనే అందరి ఆసక్తి ఉంది. ఆ మ్యాచ్పై తామంతా ఫోకస్ చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పాకిస్థాన్తో ఆడడం ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిస్తుందని అన్నాడు. ఆసియా కప్లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి.. అతని స్థానంలో రోహిత్ శర్మకి సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఈ సిరీస్లో శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
#WATCH: India, Pakistan, Sri Lanka, Bangladesh, Hong Kong& Afghanistan captains address media in Dubai ahead of Asi… https://t.co/j3na7P7T5p
— ANI (@ANI) September 14, 2018
భారత జట్టు:
రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్ ), కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ధోనీ( వికెట్ కీపర్ ), దినేష్ కార్తీక్, హర్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్, ఆక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బమ్రా , శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.
పాకిస్తాన్ జట్టు:
ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫ్రాజ్ అహ్మద్ ( కెప్టెన్/వికెట్ కీపర్ ), ఆసిఫ్ అలీ, హరిస్ సోహైల్, షాదాబ్ ఖాన్, ముహమ్మద్ నవాజ్, ఫహిమ్ అష్రఫ్, హసన్ ఆలీ, మహమ్మద్ అమిర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ షెన్వారీ, షాహీన్ అఫ్రిది