హైదరాబాద్: ఇరానీకప్లో భాగంగా రంజీ ట్రోఫీ చాంపియన్స్ విదర్భ జట్టుతో తలపడే రెస్టాఫ్ ఇండియా జట్టుని బీసీసీఐ గురువారం ప్రకటించింది. రెస్టాఫ్ ఇండియా జట్టులో ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. ఈ రెస్టాఫ్ ఇండియా జట్టుకు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రహానే సారథ్యం వహించనున్నాడు.
ఎవరూ ఇవ్వనంత!: జాకబ్ మార్టిన్కు కేఎల్ రాహుల్ భారీ సాయం
మంగళవారం నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మరోవైపు ఇంగ్లాండ్ లయన్స్తో ఇండియా-ఏ జట్టు ఆడబోయే రెండో అనధికార నాలుగు రోజుల టెస్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
రెస్టాఫ్ ఇండియా:
అజ్యింకె రహనే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్, కె.గౌతమ్, ధర్మేంద్ర జడేజా, రాహుల్ చాహర్, అంకిత్ రాజ్పుత్, తన్వీర్ ఉల్ హక్, రోనిత్ మోర్, సందీప్ వారియర్, రింకు సింగు, సుఖ్దేవ్ పటేల్.
ఇండియా-ఏ జట్టు (రెండో టెస్టు):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచల్, అంకిత్ బావ్నె, కరుణ్ నాయర్, రికీ భుయ్, సిద్ధేశ్ లాడ్, కేఎస్ భరత్, షాబాజ్ నదీం, జలజ్ సక్సేనా, మయాంక్ మార్కండె, శార్దుల్ ఠాకూర్, నవ్దీప్ సైని, వరుణ్ ఆరోన్.