హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అనారోగ్యం పాలైంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనాను వైద్యులు పరీక్షించారు. అన్నాశయానికి సంబంధించిన సమస్యగా గుర్తించి ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
5th ODIలో టీమిండియా ఓటమి: 3-2తో సిరిస్ ఆస్ట్రేలియా కైవసం
"చేదు వార్త.. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో ఆ నొప్పితోనే కొన్ని మ్యాచ్లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్ ఓపెన్లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా" అని సైనా చెప్పింది.
స్విస్ ఓపెన్లో కశ్యప్ శుభారంభం:
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కశ్యప్ 21-19, 21-17తో ఫెలిక్స్ బ్యూరెస్డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21-19, 21-17తో లుకాస్ క్లియర్బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు.
ఇక, మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12-21, 23-21, 17-21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14-21, 11-21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ 21-15, 21-17తో రాల్ఫీ జాన్సెన్-కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది.
So some sad news .. was really going through acute stomach pain from last Monday.. managed to play few matches in All England with lot of pain ... and decided to skip swiss open and come back to India and find out the issue and I found out it’s https://t.co/bylJ01B4CE
— Saina Nehwal (@NSaina) March 13, 2019