6 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా
ఈ మ్యాచ్లో పర్యాటక వెస్టిండిస్ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం హోటల్కు వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తుండగా సహచర ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్లను చాహల్ ఇంటర్వ్యూ చేశాడు.
|
కదులుతున్న బస్సులోనే సరదాగా ఇంటర్యూ
చెన్నైలో కదులుతున్న బస్సులోనే కలియతిరుగుతూ మైక్రోఫోన్ సాయంతో వారిని తనదైన శైలిలో చాహల్ ప్రశ్నించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో క్రికెటర్ల అనుభవాలను, అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ఇంటర్యూ చేసే సమయంలో చాహల్ ఫిజియో తలపై ముద్దిచ్చాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన విండిస్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్మెన్లలో నికొలస్ పూరన్ (25 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, డారెన్ బ్రేవో (37 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించాడు.
మూడో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం
అనంతరం శిఖర్ ధావన్ (92), రిషబ్ పంత్ (58) దూకుడుగా ఆడటంతో 182 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వీరిద్దరూ మూడో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్కు ఇదే అత్యధిక స్కోరు కాగా, పంత్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు. ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.