ఫస్ట్ క్లాస్ క్రికెట్(రంజీ ట్రోఫీ):
18 ఫిబ్రవరి 2006న విరాట్ కోహ్లీ తన రంజీ ట్రోఫీ కెరీర్ను ఆరంభించాడు. అరంగ్రేట మ్యాచ్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన కోహ్లీ తమిళనాడు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. ఇందులో 25బంతులాడిన కోహ్లీ కేవలం 10పరుగులు మాత్రమే చేయగలిగాడు. డ్రా గా ముగిసిన మ్యాచ్లో కోహ్లీని యో మహేశ్ అవుట్ చేసి పెవిలియన్కు పంపాడు.
ఐపీఎల్ 2019: ముంబై, పంజాబ్ జట్లలో ప్రధాన మార్పులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్:
అండర్ 19 వరల్డ్ కప్ ఆడుతున్నప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ అదే జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ అరంగ్రేట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిగా 2008 ఏప్రిల్ 16న బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేయగా ఆశోక్ దిండా అవుట్ చేశాడు. కానీ, అరంగ్రేట సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 165పరుగులు తీశాడు.
టీ20ల్లోకి అరంగ్రేటం:
2010 జూన్ 12న జింబాబ్వే ప్రత్యర్థిగా విరాట్ కోహ్లీ టీ20ల్లోకి అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్లో 21 బంతులాడి 26పరుగులు చేశాడు. 113పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
వన్డేల్లోకి అరంగ్రేటం:
శ్రీలంక ప్రత్యర్థిగా 2008 ఆగష్టు 18న వన్డేల్లోకి అరంగ్రేటం చేసిన కోహ్లీ.. తొలి మ్యాచ్లో 22 బంతులకి 12పరుగులు చేశాడు. నువాన్ కులసేకరాకు వికెట్ అప్పగించి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్లో లంక ఎనిమిది వికెట్ల తేడాతో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే 146పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది.
టెస్టుల్లోకి అరంగ్రేటం:
అన్ని ఫార్మాట్ల మాదిరే కోహ్లీ టెస్టు ఫార్మాట్లోనూ శుభారంభాన్ని నమోదు చేయలేకపోయాడు. 2011 జూనె 20న తొలి టెస్టు అరంగ్రేటంలో వెస్టిండీస్తో తలపడిన కోహ్లీ మొదటి ఇన్నింగ్స్లో 4(10)చేయగా, రెండో ఇన్నింగ్స్లో 15(54) చేసి సరిపెట్టుకున్నాడు. ఈ రెండు ఇన్నింగ్స్లలోనూ ఫిడెల్ ఎడ్వర్డ్స్ చేతుల మీదుగానే తన వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.