బుమ్రాకు విశ్రాంతి!
విండీస్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్ల నుంచి పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి టెస్టు జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. భువనేశ్వర్, షమీ ప్రధాన బౌలర్లుగా ఎంపికవ్వడం లాంఛనంగానే కనిపిస్తోంది. అలాగే చాహల్, కుల్దీప్ స్పిన్నర్లుగా ఉంటారు. వీరితో పాటు బౌలింగ్ యువ పేసర్లు నవ్దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, లెగ్స్పిన్నర్ దీపక్ చాహర్లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు.
కోహ్లీ ఉంటాడా లేదా?
విండీస్ పర్యటనలో టీ20, వన్డే సిరీస్లకు విశ్రాంతి తీసుకొని కెప్టెన్ కోహ్లీ టెస్టులు ఆడుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత గురువారం స్వదేశానికి రావడంతో విశ్రాంతి వద్దని వెస్టిండిస్ పర్యటనకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కోహ్లీకి విశ్రాంతినిచ్చి రోహిత్కు విండీస్ పర్యటనలో టీ20, వన్డేల పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
ధోనీపై ఏం తేలుస్తారో?
వెస్టిండిస్ పర్యటనకు ధోని ఎంపకవుతాడా? లేదా అని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. సెలక్టర్లు సైతం ఈ అంశంపై జులై 21న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో సెలక్టర్లు ధోనితో మాట్లాడే అవకాశం ఉంది. మరి ధోనీకి రిటైరవ్వాలని చెబుతారా? లేక విశ్రాంతినిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. పలువురు మాజీ క్రికెటర్లు ఏ విషయం అనేది ధోనికి ముందుగానే చేబితే బాగుంటుందని అంటున్నారు.