తన ఫేర్వెల్ సిరిస్కే ఎంపిక
బంగ్లాదేశ్తో సిరీస్కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడామని ఎమ్మెస్కే తెలిపాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనలకు ధోని సైతం మద్దతు తెలిపాడని అన్నాడు. రిటైర్మెంట్పై తుది నిర్ణయం ధోనీదేనని... మేం పూర్తిగా భవిష్యత్తుపై దృష్టి పెట్టామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీంతో ధోనీని తన ఫేర్వెల్ సిరిస్కే ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సెలక్షన్ కమిటీతో ధోని
ఈ విషయమై సెలక్షన్ కమిటీతో ధోని మాట్లాడిటన్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్నెస్తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నాడు. రిటైర్మెంట్పై వస్తోన్న ఊహాగానాలకు కూడా ధోని ముగింపు పలకనున్నట్లు తెలిసింది. తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్ను ప్రారంభించాడు.
జిమ్లో ధోని కసరత్తులు
ఇందులో భాగంగా జిమ్లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు. జాతీయ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జార్ఖండ్ అండర్-23 జట్టు తమ తొలి మ్యాచ్లో భాగంగా కేరళతో తలపడనుంది. వచ్చే గురువారం నుంచి ధోని జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి పాక్టీస్ చేయనున్నాడు.
తన ఫిట్నెస్ ట్రైనింగ్ను ప్రారంభించిన ధోని
"ధోని జార్ఖండ్ సీనియర్ జట్టుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్తో మాట్లాడాడు. జిమ్లో కసరత్తులు చేయడం ద్వారా ధోని తన ఫిట్నెస్ ట్రైనింగ్ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా ధోని బ్యాడ్మింటన్, టెన్నిస్, బిలియర్డ్స్ ఆడాడు. జనవరి నుంచి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ధోని సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ధోని భాగస్వామ్యం కాలేదు" అని జేఎస్సీఏ అధికారి ఒకరు తెలిపారు.
గంగూలీ సైతం
మరోవైపు ధోని రిటైర్మెంట్పై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ధోని భారత జట్టుకు గర్వకారణమని, తన హయాంలో అతడికి సముచిత గౌరవం లభిస్తుంది" అని అన్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్లు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఫేర్వెల్ సిరిస్ ఇచ్చే ఉద్దేశ్యంతో బీసీసీఐ ఉన్నట్లు గంగూలీ చెప్పకనే చెప్పాడు.