గత కొన్నేళ్లుగా అప్ఘనిస్థాన్
గత కొన్నేళ్లుగా అప్ఘనిస్థాన్ తన మ్యాచ్లను భారత్లోనే ఆడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ల కోసం డెహ్రాడూన్, నోయిడాలోని స్డేడియాలను గతంలో అప్ఘనిస్థాన్ హోమ్గ్రౌండ్గా బీసీసీఐ అంగీకరించింది. కానీ, డెహ్రాడూన్లో ఫైవ్ స్టార్ వసతులు లేకపోవడంతో అప్ఘనిస్థాన్ వేరే స్టేడియం ఇవ్వాలని గత కొంతకాలంగా బోర్డుని అభ్యర్థిస్తోంది.
అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో సమావేశం
ఇందులో భాగంగా గత నెలలో అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీసీఐ పాలకుల కమిటీ లక్నోలోని అటల్ బిహారి వాజ్పేయీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని అప్ఘనిస్థాన్ హోమ్ గ్రౌండ్గా అనుమతిచ్చింది. భద్రత, సౌకర్యాల దృష్ట్యా తమ సొంత దేశంలో అఫ్గానిస్థాన్ అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించని సంగతి తెలిసిందే.
సీఈవో అసదుల్లా ఖాన్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో అసదుల్లా ఖాన్ మాట్లాడుతూ "బీసీసీఐ మా అభ్యర్థనను అధికారికంగా అంగీకరించింది. డెహ్రాడూన్లో ఫైవ్స్టార్ వసతులు లేవు. దీని వల్ల అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించడంలో మాకు సమస్యలు తలెత్తుతున్నాయి. లఖ్నవూలో ఇలాంటి సమస్యలు ఎదురవ్వవు" అని అన్నారు.