|
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటికే వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్ జట్టు 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ను చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. మరోవైపు పర్యాటక జట్టు మాత్రం మూడో వన్డేలో గెలిచి సిరిస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆశిస్తోంది.
|
రాంచీలో ధోనికిదే చివరి మ్యాచ్
మరోవైపు ధోనీ సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండగా.. వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తుండటంతో రాంచీలో అతనికిదే చివరి మ్యాచ్ కానుంది. ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్ స్థానంలో రిచర్డ్సన్ తుది జట్టులోకి వచ్చాడు.
|
ఆర్మీ క్యాప్లతో బరిలోకి కోహ్లీసేన
ఇదిలా ఉంటే, పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా ఆర్మీ క్యాప్లను భారత జట్టులోని ఆటగాళ్లు ధరించారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ధోని లెప్టెనెంట్ కల్నల్ హోదాలో జట్టులోని సహచర ఆటగాళ్లకు ఈ క్యాప్లను అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
|
నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా
మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లల చదువు కోసం వినియోగించనున్నారు.