ఆఖరి బంతికి టీమిండియా విజయం
అనంతరం శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో టీమిండియా ఆఖరి బంతికి విజయం సాధించింది. . వీరిద్దరూ మూడో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్కు ఇదే అత్యధిక స్కోరు కాగా, పంత్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు.
నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు
ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుండటంతో ఈ పర్యటనకి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్ అందుకోవడం భారత్ జట్టుకి గొప్ప ఉపశమనమని మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
వన్డే, టీ20ల్లో రిషబ్ పంత్ విఫలం
వాస్తవానికి, చెన్నై టీ20కి ముందు వెస్టిండీస్తో ఐదు వన్డేలు, రెండు టీ20లు ఆడిన శిఖర్ ధావన్ చేసిన అత్యధిక పరుగులు 43. లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో ఈ పరుగులను నమోదు చేశాడు. ఇక, పంత్ విషయానికి వస్తే, వెస్టిండీస్తో రెండు టెస్టుల్లోనూ 92, 92 పరుగులతో సత్తాచాటినప్పటికీ... వన్డే, టీ20ల్లో విఫలమయ్యాడు.
చివరి రెండు వన్డేల్లో రిజర్వ్ బెంచికి పరిమితమైన పంత్
దీంతో విండీస్పై మూడు వన్డేల అనంతరం అతనిపై వేటు వేసిన టీమిండియా మేనేజ్మెంట్ చివరి రెండు వన్డేల్లోనూ పంత్ను రిజర్వ్ బెంచ్కి పరిమితం చేసింది. ఆ తర్వాత ప్రారంభమైన టీ20ల్లో పంత్కు జట్టు మేనేజ్మెంట్ తుది జట్టులో అవకాశమిచ్చింది. తొలి రెండు టీ20ల్లోనూ పంత్ చేసిన పరుగులు 1, 5 పరుగులు మాత్రమే.
నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్
దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్లో రిషబ్ పంత్కు చోటు దక్కుతుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఆఖరి టీ20లో రాణించిన ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్కు మార్గం సుగమనం చేసుకున్నారు. నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.