
వన్డే జట్టులో చోటు
‘వన్డే జట్టులో స్థానం సంపాదించమని ఆమె నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తోంది. నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ.. తుది నిర్ణయం సెలక్టర్లే కదా!' అని 32 ఏళ్ల సాహా వెల్లడించాడు. అయితే ఇందులో సాహా భార్య రోమీ చేసిన తప్పేంటని అనుకుంటున్నారా?

టెస్టు క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత
టెస్టు క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని స్థానంలో వికెట్ కీపర్గా సాహా 28 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 2014లో చివరి సారి లంకపై వన్డే మ్యాచ్ ఆడిన సాహా.. కెరీర్లో మొత్తం 9 వన్డేలాడి కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వన్డేల్లో సాహా అత్యధిక స్కోరు 16. ఇలాంటి బ్యాట్స్మెన్.. ధోనీ స్థానంలో రావాలనుకోవడం హాస్యాస్పదం అని అభిమానులు చురకలంటించారు.

ధోని స్ధానాన్ని సాహా భర్తీ చేశాడో
మరో ఆరు నెలల్లో 2019 వరల్డ్ కప్లో బరిలోకి దిగే భారత జట్టుపై ఒక స్పష్టత వస్తుందని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఎలాగైతే ధోని స్ధానాన్ని సాహా భర్తీ చేశాడో... వన్డేల్లో కూడా అదే విధంగా భర్తీ చేయాలనేది సాహా భార్య కోరిక.

సాహా భార్య కోరికను గ్రహించిన ధోని అభిమానులు
సాహా భార్య కోరికను గ్రహించిన ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ధోని లాంటి దిగ్గజ క్రికెటర్ స్ధానంలో తన భర్తని వరల్డ్ కప్ జట్టులో చూడాలనుకోవడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్లో ధోని మునుపటి ఫామ్ అందుకుని వరుస హాఫ్ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











