చిన్న ఆటంకమే..
‘ఇది బీసీసీఐలో పెద్ద ఆర్థిక సంక్షోభమని చెప్పను. చిన్న అవరోధం మాత్రమే. మేం ఏళ్ల తరబడి ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. పెద్ద పెద్ద విషయాలు ఓవర్నైట్లో జరగవు. అలాగని ఓవర్నైట్లో పోవు. సుదీర్ఘకాలంగా మేం ఎన్నో ఎదుర్కొన్నాం. కొన్నిసార్లు విజయం సాధించాలంటే మరికొన్ని ఆటంకాలను ఎదుర్కోక తప్పదు. బీసీసీఐ చాలా బలమైన సంస్థ. గతంలో పనిచేసిన ఆడ్మినిస్ట్రేటర్స్, ఆట.. ఆర్గనైజేషన్ను బలంగా తీర్చిదిద్దాయి. కాబట్టి చిన్న ఆటంకాలను హ్యాండిల్ చేసే సత్తా బోర్డుకు ఉంది.'అని దాదా పేర్కొన్నాడు.
జియో వద్దనుకుంది..
టైటిల్ స్పాన్సర్షిప్ విషయంలో ఇప్పటివరకు బీసీసీఐ ముందడుగు వేయకపోయినా.. వీలైనంత త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బోర్డు పెద్దలు ఆశాభావంతో ఉన్నారు. అయితే రేస్లో అందరికంటే ముందున్న రిలయన్స్ జియో.. స్పాన్సర్షిప్ విషయంలో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. కనీసం చర్చలు జరపడానికి కూడా ఆసక్తిచూపలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.
పేటీఎమ్, బైజూస్ కూడా..
జియో వెనక్కి తగ్గడంతో బీసీసీఐ.. పేటీఎమ్, బైజూస్, టాటా మోటార్స్, డ్రీమ్ 11ను సంప్రదించినా ఊహించినంత ప్రోత్సాహం లభించలేదని సమాచారం. అయితే ఒకవేళ వీళ్లలో ఎవరు స్పాన్సర్షిప్ సంపాదించినా.. బీసీసీఐ మరోసారి యాంటీచైనా సెంటిమెంట్ను ఎదుర్కోక తప్పేలా లేదు. ఎందుకంటే పేటీఎమ్, బైజూస్, డ్రీమ్ 11లో చైనీస్ కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.