బుమ్రా, షమీ ఇబ్బంది పెడ్తారు..
భారత ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.. ఈ జోడి కచ్చితంగా ఆసీస్ బ్యాటింగ్ను ముప్పు తిప్పలు పెడుతుందని జోస్యం చెప్పాడు. ఆసీస్తో వన్డే సిరీస్లో వీరిద్దరూ ఎలా బౌలింగ్ చేస్తారో అని ఆతృతగా ఉందన్నాడు. ప్రధానంగా ఆసీస్ ప్రధాన బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్లను ఎలా కట్టడి చేస్తారో చూడాలని ఉందన్నాడు. మంచి పేస్ ఉన్న ఈ ఇద్దరు పిచ్ సహకారంతో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అదో పనికిమాలిన నిర్ణయం..
వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో మహ్మద్ షమీని ఆడించకపోవడాన్ని ఓ పనికిమాలిన నిర్ణయంగా గంభీర్ అభివర్ణించాడు. అద్భుత ఫామ్ లో ఉన్న అతన్ని ఆడించకపోవడం చెత్త నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. బెంగళూరు, వాంఖడే వంటి చిన్న మైదానాల్లో ఆడుతున్నప్పుడు బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ గా ఉండాలన్నాడు. అయితే షమీ వంటి బౌలర్ జట్టులో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశమన్నాడు.గాయం నుంచి రి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా సైతం క్వాలిటీ బౌలరేనని తెలిపాడు. ఈ ఇద్దరు ఆసీస్ ను ఇబ్బంది పెడ్తారన్నాడు.
మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్న స్మిత్.. కారణం ఇదే?!!
మిడిలార్డర్ ఎలా ఆడుతుందో..
బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న భారత్ కు మిడిలార్డర్ ఎలా ఆడుతుందోననేది ఒక్కటే కలవరపెట్టే అంశమని, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారోననేది పరిశీలించాల్సిన అంశమని గంభీర్ తెలిపాడు. బలమైన ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కోహ్లీ సేనకు కష్టమేనన్నాడు. వీరిని ఎదుర్కోవడం బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడినంత సులవుకాదన్నాడు. గతేడాది పర్యటనలో ఇండియాను ఓడించిన ఆసీస్ జట్టులో మిచెల్ స్టార్క్, హజల్ వుడ్ లేరని, కానీ ఇప్పుడు ఉన్నారని, ఇండియా బ్యాటింగ్ కు ఈ సిరీస్ సవాల్ తో కూడుకున్నదేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు.