|
మరవలేని రోజుకు 37 ఏళ్లు..
నాటి సారథి కపిల్ దేవ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ అద్భుత విజయాన్ని స్మరించుకున్నాడు. లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ అందుకున్న త్రోబ్యాక్ ఫొటోను షేర్ చేస్తూ ‘ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 37 ఏళ్లు.'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఇక 1983 ప్రపంచకప్ విజయంతో ఓ బెంచ్మార్క్ సెట్ చేశారనీ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘దేశం మొత్తం గర్వించిన క్షణం. సరిగ్గా ఇదే రోజు మా సీనియర్లు ప్రపంచకప్ అందుకున్నారు. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడికి అభినందనలు. ఈ విజయంతో 2011 ప్రపంచకప్ను మేం గెలిచేలా బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇక అన్ని క్రీడల్లో భారత్ విశ్వవిజేత కావాలనుకుంటుంది.'అని యూవీ పేర్కొన్నాడు.
|
అనుకున్నాం.. గెలిచాం..
1983 ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నామని, అలాగే గెలిచామని ఆ విన్నింగ్ టీమ్ మెంబర్, భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ‘1983 జూన్ 25న ప్రపంచ చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నాం. అలాగే గెలిచాం. అలా భారతలో క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాం. ఈ సందర్భంగా అప్పటి కపిల్ డెవిల్స్కు, భారతీయులకు ధన్యవాదాలు.'అని తన త్రోబ్యాక్ పిక్ జత చేస్తూ రవిశాస్త్రి క్యాప్షన్గా పేర్కొన్నాడు.
కపిల్ చెప్పిన ఆ మాటలే 1983 ప్రపంచకప్ విజయానికి కారణం: శ్రీకాంత్
|
క్రికెట్ మార్పునకు అదే కారణం..
ఇక భారత క్రికెట్ మార్పునకు 1983 ప్రపంచకప్ విజయమే కారణమని మహ్మద్ కైఫ్ తెలిపాడు. ‘ఆ నాడు లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ను అందుకున్న కపిల్ ఫొటో భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని దృశ్యం. మన దేశంలో క్రికెట్ మార్పునకు అదే కారణం. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని ఈ విజయం భావితరాలకు తెలియజేసింది. స్ఫూర్తిమంత్రంగా నిలిచింది. అలాగే పెద్ద కలలు కనాలని సూచించింది.'అని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేయగా.. ‘37 ఏళ్ల క్రితం ప్రపంచకప్ సాధించిన కపిల్దేవ్ జట్టుకు ధన్యవాదాలు. అలాగే మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు'అని హర్భజన్సింగ్ స్మరించుకున్నాడు.
భారత్ 180.. విండీస్ 140
నాటి ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులకు ఆలౌటవ్వగా తర్వాత విండీస్ 140 పరుగులకే కుప్పకూలింది. మోహిందర్ అమర్నాథ్ ఆల్రౌండ్ షోతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కపిల్ సేన విశ్వవిజేతలుగా నిలిచి భారత క్రికెట్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఇక ఆ మ్యాచ్లో తమ స్కోర్ చూసి గెలుస్తామనుకోలేదని, కానీ కపిల్ మాటలు స్పూర్తిని రగిల్చాయని నాటి విన్నింగ్ టీమ్ ఓపెనర్ క్రిష్ శ్రీకాంత్ తెలిపాడు.