ఫస్ట్ బ్యాటింగ్ బెటర్..
'రికార్డు పరిశీలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే భారత్ ఫారిన్లో ఎక్కువ విజయాలు సాధించింది. 2002 లీడ్స్లో కావొచ్చు. 2018లో సౌతాఫ్రికాలో కావాచ్చు. బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉన్నప్పటికీ భారత్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. ఆరంభంలో ఉన్న ఒత్తిడి తట్టుకుని నిలబడి భారీ స్కోరు చేసి విజయం కూడా సాధించింది. సీమింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మార్క్ టేలర్, స్టీవ్ వా కూడా చాలా అరుదుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇక, ఫైనల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్పై పెద్ద బాధ్యత ఉంది.'అని దాదా చెప్పుకొచ్చాడు.
ఒత్తిడిలో బ్యాటింగ్ కష్టం..
క్రికెట్ విశ్లేషకులు సైతం ఇదే మాట చెబుతున్నారు. వర్షం అంతరాయం కలిగించనున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు. పైగా ఈ మెగా పోరులో ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని, దాంతో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుందంటున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా సాఫీగా ఆడాలంటే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. పైగా చివరి రెండు రోజులు పిచ్పై పగుళ్లు వచ్చి స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంటుందని, నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
తటస్థ వేదిక కాబట్టి..
అయితే పిచ్ మరి పచ్చికగా ఉంటేనే తొలుత ఫీల్డింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని, కానీ ఐసీసీ ఈవెంట్ కావడంతో పిచ్ న్యూట్రల్గా ఐదురోజులు ఆట సాగేలా ఉంటుందంటున్నారు. కాబట్టి టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే మ్యాచ్ను శాసించవచ్చంటున్నారు. ఇరు జట్లలో ఓపెనర్లు కీలకం కానున్నారని, అలాగే బౌలర్లు రాణించడంపై కూడా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు.