గత 8 ఏళ్లుగా శుభారంభం లేదు..
ఇక ముంబై ఇండియన్స్ గత 8 ఏళ్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచినప్పటికీ.. ఈ 8 సీజన్లలో ఒక్కసారి కూడా శుభారంభం అందుకోలేదు. తాజా సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్లో కూడా ముంబై ఈ సెంటిమెంట్ను కొనసాగిస్తూ ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ చాంపియన్గా నిలిచిన 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో నాలుగు సార్లు ఆ జట్టు ఫస్ట్ మ్యాచ్ ఓడి సెకండ్ మ్యాచ్ గెలిచింది.
2015 మినహా..
ముంబై గెలిచిన ఈ ఐదు సీజన్లలో ఒక 2015లోనే ముంబై వరుసగా ఓటమిపాలైంది. కానీ 2013లో ఆర్సీబీ చేతిలో ఫస్ట్ మ్యాచ్ ఓడి.. సెకండ్ మ్యాచ్లో చెన్నైపై గెలుపొందింది. 2015లో ఈ సెంటిమెంట్ రిపీట్ కాకపోయినా టైటిల్ నెగ్గింది. 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన ముంబై.. సెకండ్ మ్యాచ్లో కోల్కతాపై గెలుపొందింది. 2019, 2020లోనూ ఇదే తరహాలో ఫస్ట్ మ్యాచ్లో ఓడి.. రెండో మ్యాచ్లో గెలిచిన ముంబై టీమ్ టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2020లో చెన్నై చేతిలో ఫస్ట్ మ్యాచ్లో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్లో కోల్కతాపై గెలిచింది. 2019లో ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్లో బెంగళూరుపై గెలిచింది.
ఈసారి ముంబైదే..
తాజా సీజన్లో ఆర్సీబీ చేతిలో ఓడిన డిఫెండింగ్ చాంపియన్.. సెకండ్ మ్యాచ్లో కోల్కతాపై అద్భుత విజయాన్నందుకుంది. దాంతో ఈ సెంటిమెంట్ మరోసారి నిరూపితంకానుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కూడా టైటిల్ ముంబైదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెంటిమెంట్కు సంబంధించిన గణంకాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా? అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.
సూపర్బ్ విక్టరీ..
కేకేఆర్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 43) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా నైటరైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు ఓపెనర్లు నితీష్ రాణా(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57), శుభ్మన్ గిల్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 33) శుభారంభం అందించినా ఫలితం లేకపోయింది. రాహుల్ చాహర్ 4 వికెట్లతో కోల్కతా పతనాన్ని శాసించాడు.