
విరాట్ కోహ్లీ - 591 పరుగులు
మోడ్రన్ డే క్రికెట్లో బెస్ట్ బ్యాట్స్మన్గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నా... ఫార్మాట్తో సంబంధంతో లేకుండా విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తోన్న సంగతి తెలిసిందే. కరేబియన్ దీవువల్లో వెస్టిండిస్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 15 మ్యాచ్ల్లో 45.56 యావరేజితో పాటు 87.29 స్ట్రయిక్ రేట్తో 591 పరుగులు చేశాడు. కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఒకటికి మించి సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్మన్ కోహ్లీనే.
ఇంగ్లాండ్ లీగ్లో బాబర్ ఆజాం విజృంభణ.. దెబ్బకు వెబ్సైట్ క్రాష్ అయింది

యురవాజ్ సింగ్ - 555 పరుగులు
పరిమిత ఓవర్ల క్రికెట్లో యువరాజ్ సింగ్ గొప్ప మిడిలార్డర్ బ్యాట్స్మెన్. ఇటీవల యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన హార్డ్-హిట్టింగ్తో బ్యాటింగ్ ఆల్ రౌండర్ పేరొందిన యువరాజ్ సింగ్అనేక దేశాలపై గొప్ప రికార్డులను సొంతం చేసుకున్నాడు. కరేబియన్ గడ్డపై యువరాజ్కు మంచి రికార్డు ఉంది. వెస్టిండిస్పై భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యువీ మొత్తం 17 మ్యాచ్ల్లో 37 యావరేజితో 555 పరుగులు చేశాడు.
మరో 144 పరుగులు చేస్తే: విండిస్ పర్యటనలో కోహ్లీ బద్దలు కొట్టే రికార్డులివే!

మహేంద్ర సింగ్ ధోని - 532 పరుగులు
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గ్రేటేస్ట్ ఫినిషర్లలో ఒకడు. వెస్టిండిస్ జట్టుపై ధోని కూడా మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. వెస్టిండిస్ జట్టుపై ధోని మొత్తం 19 మ్యాచ్ల్లో 48కిపైగా యావరేజితో 532 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండిస్ జట్టుపై ధోని అత్యధిక స్కోరు 95. 2013లో కరేబియన్ దీవుల్లో జరిగిన ముక్కోణపు సిరిస్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ధోని ఈ స్కోరు సాధించాడు.


Click it and Unblock the Notifications
