|
రోహిత్.. రోహిత్ కాదు ఇండియా.. ఇండియా
ఫీల్డింగ్లో భాగంగా రోహిత్ బౌండరీ లైను వద్దకు వచ్చాడు. రోహిత్ శర్మను దగ్గరగా చూడటంతో అతని అభిమానులు ఒక్కసారిగా రోహిత్.. రోహిత్.. అంటూ అరవడం మొదలుపెట్టారు. దానిని చూసి రోహిత్ శర్మ వెనుదిరిగి తన జెర్సీపై ఉన్న ఇండియా పేరును చూపించాడు. అలా చూపిస్తూ రోహిత్ బదులు ఇండియా అంటూ అరవాల్సిందిగా సూచించాడు. అర్థం చేసుకున్న అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ అరవడం మొదలుపెట్టారు. కాగా, ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్గా మారింది.
భారత క్రికెట్ ప్రమాదంలో ఉంది: గంగూలీ
224 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రోహిత్ శర్మ (162; 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సు), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సు) సెంచరీలతో చెలరేగిన వేళ.. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఏకంగా 224 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. ఖలీల్ అహ్మద్ (3/13), కుల్దీప్ (3/42) ధాటికి ఛేదనలో విండీస్ 36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది.
పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తా
‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సెంచరీ, డబుల్ సెంచరీల గురించి ఆలోచించను. జట్టు కోసం పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తాను. ఈ రోజు మ్యాచ్లో డబుల్ సెంచరీ చేయొచ్చని రాయుడు చెప్పాడు. కానీ నేను బ్యాటింగ్ మీదే దృష్టి పెట్టాను. డబుల్ సెంచరీ గురించి ఆలోచించలేదు'