అభిమానులు వస్తారో లేదో
అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో టెస్టు మ్యాచ్లను నిర్వహించడం వల్ల లాభం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. గత కొన్నాళ్లుగా భారత్ టెస్టు మ్యాచ్లను వివిధ వేదికల్లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో టెస్ట్ మ్యాచ్లను ప్రధాన వేదికల్లో ఆడించేవారు.
రోటేషన్ పాలసీ ప్రకారం
అయితే, 2015 నుంచి రోటేషన్ పాలసీ ప్రకారం అన్ని వేదికల్లోనూ టెస్ట్ మ్యాచ్లు ఆడిస్తున్నారు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ "దేశంలోని అన్ని వేదికల్లోనూ టెస్ట్ మ్యాచ్లు ఆడించాల్సిన అవసరం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ల కోసం రోటేషన్ పద్ధతి పాటించినా.. టెస్ట్ మ్యాచ్లను ఎప్పుడూ ఐదు వేదికల్లో నిర్వహిస్తే బాగుంటుంది" అని అన్నాడు.
ధోనీ మా గెస్ట్.. డ్రస్సింగ్ రూమ్లో ఉన్నాడు.. హలో చెప్పండి!!(వీడియో)
టెస్టు క్రికెట్ బతకాలంటే
"టెస్టు క్రికెట్ బతకాలంటే, ఐదు శాశ్వత వేదికలు చాలు. అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో నిర్వహణ వల్ల లాభం లేదు. భారత్కు వచ్చే ప్రతిజట్టుకు ఎక్కడ ఆడతామో ముందే తెలియాలి. అప్పుడే ఆటగాళ్లకు పిచ్ల గురించి అవగాహన ఉంటుంది. ఫలితంగా సిరీస్లు మరింత రసవత్తరంగా సాగుతాయి" అని కోహ్లీ పేర్కొన్నాడు.
టీమిండియా విజయం సాధించడంతో
ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక టెస్టు మ్యాచ్లు నెగ్గిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాపై మొత్తం 10 టెస్టులాడి 7 టెస్టుల్లో విజయం సాధించింది.
3-0తో సిరిస్ క్లీన్ స్వీప్
ఇతర కెప్టెన్ల నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై మొత్తం 29 టెస్టులాడగా కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే గెలవగలిగింది. 2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో చేజార్చుకుంది. ఆ తర్వాత 2018లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్లింది.
సిరిస్ నెగ్గేందుకు భారత్ కష్టతరమైన ప్రదేశం: గణాంకాలే చెబుతున్నాయి
కోహ్లీకి ఇదే తొలి వైట్వాష్ సిరిస్
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 2-1తో టెస్టు సిరిస్ను కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 3-0తో టెస్టు సిరిస్ను గెలిచింది. ఫలితంగా సఫారీలను క్లీన్స్వీప్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుపై కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి వైట్వాష్ సిరిస్ కావడం విశేషం.