కెప్టెన్ కోహ్లీ తనకో గొప్ప పాఠం
వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జట్టులో ముందుకు దూసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకో గొప్ప పాఠం నేర్పించాడని యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్పంత్ చెప్పాడు. ఇతరుల పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని తనతో చెప్పాడని పంత్ వెల్లడించాడు.
ఉద్యోగం లేకపోయినా ఆడగలననే నమ్మకముంది : కోహ్లీ
ఇమేజ్ను గదిలోనే వదిలేయడం
‘ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఒక భాగమయ్యాయి. వాటిని పక్కనపెట్టలేం. అయితే మైదానం బయట ఉండే ఇమేజ్ను గదిలోనే వదిలేయడం నేర్చుకున్నా. ఎన్ని మ్యాచ్లు ఆడినా మైదానంలోకి వెళ్తే కాస్త ఆందోళన ఉంటుంది. 50 మ్యాచ్లు ఆడినంత మాత్రాన అనుభవం వచ్చినట్టు కాదని విరాట్ భయ్యా చెప్పాడు. ఇతరుల పొరపాట్ల నుంచి నేర్చుకొనే వ్యక్తి 4 మ్యాచ్లు ఆడినా 50తో సమానమే అని చెప్పినట్లు తెలిపాడు.' అని రిషబ్ వెల్లడించాడు.
మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నా
ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికైన రిషబ్ పంత్తో టీమిండియా కోచ్ రవిశాస్త్రి నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. ‘కోచ్ రవిశాస్త్రి నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి ఎలా ఆడాలో అనే విషయాలను వివరిస్తున్నారు. క్రీజులో నిలదొక్కుకొనేందుకు కాస్త సమయం తీసుకొని తర్వాత నా శైలిలో చెలరేగాలని రోహిత్ భయ్యా చెప్పాడు. మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నాను' అని పంత్ తెలిపాడు.
భారత జట్టులో పోటీపడేందుకు రాలేదు
మహేంద్రసింగ్ ధోనీతో తనకి పోలికలు తేవడంపై విసుగుచెందిన పంత్ తాజాగా స్పందించాడు.‘ఎవరితోనో పోటీపడేందుకు నేను భారత జట్టులో లేను. ఇది నా కెరీర్లో నేర్చుకునే సమయం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన ప్రమాణాల్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నా' అని ఘాటుగా బదులిచ్చాడు.