'పరిస్థితులకు అనుగుణంగా ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. బీసీసీఐ క్రికెట్ను మాత్రమే చూసుకునే సంఘం. క్రికెట్ ఒలింపిక్ క్రీడా కాదు కాబట్టి దాని సంగతి అది చూసుకుంటుంది. టోర్నీలు జరగాలా వద్దా అన్నది కాదిక్కడ ప్రశ్న. లక్షల మంది హాజరవుతారు కాబట్టి ప్రజల సంక్షేమం గురించే అసలు ప్రశ్న' అని కిరణ్ రిజిజు తెలిపారు.
ఇక కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని క్రీడా ఫెడరేషన్లకు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీలైతే టోర్నీలు వాయిదా వేయాలని, అలా కుదరని పోటీలను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా జన సమూహాలు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ను బీసీసీఐ ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. సౌతాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్ను రద్దు చేసింది. ఇక దేశవాళీ టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ.. ధోనీ మాకు కావాలి.. టీ20 ప్రపంచకప్ ఆడాలి!!