ఆదిలోనే గట్టి షాక్..
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ బౌలింగ్లో డేవిడ్ వార్నర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నదీమ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే మార్కస్ స్టోయినిస్(5) కూడా వార్నర్కు చిక్కి నిరాశపరిచాడు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన హెట్మైర్(16)తో రహానే(26) బాధ్యతాయుతంగా ఆడటంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 54 రన్స్ చేసింది.
వార్నర్ బౌలింగ్..
ఆ వెంటనే వార్నర్ రషీద్ ఖాన్ను రంగంలోకి దింపగా.. ఫస్ట్ బాల్కే హెట్మైర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతికి రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది. రిషభ్ పంత్, అయ్యర్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. ఈ జోడీని విజయ్ శంకర్ ఆదిలోనే విడదీశాడు. 12వ ఓవర్లో అయ్యర్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఆఖరి బంతి వేసేముందు అతని తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. దాంతో డేవిడ్ వార్నర్ బౌలర్గా అవతారమెత్తాడు. చివరి బంతిని ఎట్టకేలకు పూర్తి చేశాడు. తొలి బంతి వైడ్ వేసినా మరుసటి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు. ఇక ఐపీఎల్లో వార్నర్ బౌలింగ్ చేయడం ఇదే ప్రథమం.
రషీద్ 4-0-7-3..
క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(1)ను రషీద్ ఔట్ చేయడంతో ఢిల్లీ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ మ్యాచ్లో రషీద్ ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసిన రషీద్.. 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది అతనికి అత్యుత్తం. ఇందులో 17 డాట్ బాల్స్ ఉన్నాయి. అనంతరం రబడా(3), పంత్(36) వరుస బంతుల్లో ఔటవ్వడంతో హైదరాబాద్ విజయం లాంఛనమైంది.