న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Rest of the World షెడ్యూల్ ఖరారు.. భారత సారథిగా సౌరవ్ గంగూలీ!

India vs Rest of the World game scheduled for September 15, Sourav Ganguly to lead the Indian side

న్యూఢిల్లీ: భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ షెడ్యూల్ ఖారారైంది. ఫ్రాంచైజీ క్రికెట్ పురుడు పోసుకోకముందు ఈ తరహా మ్యాచ్‌లు చాలా జరిగేవి. అయితే ధనాధన్ లీగ్‌లు రాజ్యమేలుతుండటంతో భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్‌ల ఊసే లేకుండా పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్‌ జరగనుంది. వచ్చే నెల 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుత క్రికెటర్లతో కాకుండా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ ఆడనున్నారు. భారత జట్టును బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నడిపించనుండగా.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు.

కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో..

భారత్ 75 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం భారత క్రికెట్ బోర్డుకు లేఖ రాసినట్లు కూడా వార్తలు వచ్చాయి. బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ నిర్వహించడం కష్టమని, భారత్‌తో పాటు మిగతా అంతర్జాతీయ జట్లు బీజీ షెడ్యూల్‌తో ఆడుతున్నాయని తెలిపినట్లు సమాచారం.

బిజీ షె2డ్యూల్ కారణంగా..

బిజీ షె2డ్యూల్ కారణంగా..

ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర క్రికెట్ బోర్డులు బీసీసీఐ విన్నపాన్ని పట్టించుకోవని, వారిని ఒప్పించడం కష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆటగాళ్లతో కాకుండా మాజీ క్రికెటర్లతో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‌సీ) ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందే భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక భారత జట్టులో గంగూలీ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు ఆడనున్నారు. వీళ్లంతా గతంలో గంగూలీ సారథ్యంలో భారత జట్టుకు ఆడినవారే కావడం విశేషం.

అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia
 జట్ల వివరాలు :

జట్ల వివరాలు :

భారత్ : సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా (వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్జాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండి సిమన్స్, హెర్షెలీ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్ (వికెట్ కీపర్), నాథన్ మెక్ కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హమిల్టన్ మసకద్జ, మష్రఫీ మొర్తజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేశ్ రామ్దిన్ (వికెట్ కీపర్)

Story first published: Friday, August 12, 2022, 15:34 [IST]
Other articles published on Aug 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X