బలమైన పునాదీ..
'పుజారా తన జిడ్డు బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు సహనాన్ని పరీక్షంచడమే కాకుండా భారత ఇన్నింగ్స్కు బలమైన పునాదీ వేస్తాడు. అతని నెమ్మదైన బ్యాటింగ్ మరో ఎండ్లో ఉన్న స్ట్రోక్ ప్లేయర్లకు ఎలాంటి దిగులు లేకుండా స్వేచ్చగా షాట్లు ఆడే అవకాశాన్నిస్తుంది. వరుసగా వికెట్లు కోల్పోయినా మరో ఎండ్లో పుజారా ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల భారత్ సాధించిన విజయాలను గమనిస్తే పుజారా ప్రాధాన్యత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.
పుజారా వల్లే..
ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్లో పంత్తో కలిసి పుజారా క్రీజులో నిలబడటంతోనే భారత్ ఓటమిని తప్పించుకొని డ్రాతో గట్టెక్కింది. బ్రిస్బేన్లో విజయం సాధించడానికి కూడా అతని నెమ్మదైన బ్యాటింగే కారణం. అతను క్రీజులో ఉండటంతో శుభ్మన్, పంత్ స్వేచ్చగా ఆడారు. కానీ ఇది గుర్తించకుండా అతని స్ట్రైక్ రేట్, పరుగుల గురించి మాట్లాడుతూ ఉంటారు. జట్టులో అతని ప్రాధాన్యతను కూడా తక్కువ అంచనా వేసారు. జట్టులో అతను చాలా కీలకమైన, విలువైన ఆటగాడు.
తక్కువ అంచనా వేయవద్దు..
వికెట్లు త్వరగా కోల్పోయినా అతను ఇన్నింగ్స్ను నిలబెట్టగలడు. అదే అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టింది. ది వాల్, ది రాక్ ఏ పేరుతోనైనా పిలవండి. కానీ అతను భారత బ్యాటింగ్కు జిగురులాంటివాడనే విషయాన్ని మర్చిపోవద్దు.'అని గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్తో ఫస్ట్ టెస్ట్లో కూడా తొలి ఇన్నింగ్స్లో పుజారా హాఫ్ సెంచరీ చేయడంతోనే భారత్ ఆ పరుగులైనా చేయగలిందన్నాడు. రెండో ఇన్నింగ్స్లో విఫలమవడంతో టపాటపా వికెట్లు కోల్పోయిందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఓటమి ముంగిట భారత్..
ఇంగ్లండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో భారత్ ఓటమి ముంగిట నిలిచింది. 39/1 ఓవర్నైట్ స్కోర్తో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏ మాత్రం ఊహించని రీతిలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ పెవిలియన్ బాటపట్టింది. శుభ్ మన్ గిల్(50), విరాట్ కోహ్లీ(72) పోరాడినా.. బ్యాటింగ్కు ప్రతి కూలంగా మారిన పిచ్పై ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు.
ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ ఒకే ఓవర్లో శుభ్మన్, రహానేను ఔట్ చేసి నడ్డి విరిచాడు. ఆ తర్వాత పంత్, సుంధర్ కూడా నిరాశపరచగా.. విరాట్, అశ్విన్ పోరాడారు. కానీ అశ్విన్ను లీచ్.. కోహ్లీని స్టోక్స్ ఔట్ చేయడంతో భారత్ ఓటమి ఖాయామైంది. ప్రస్తుతానికి 55 ఓవర్లలో భారత్ 8 వికెట్లకు179 పరుగులు చేసింది. క్రీజులో నదీమ్, ఇషాంత్ ఉన్నారు.