140 పరుగులకే కుప్పకూలిన భారత్
287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో చివరిరోజైన మంగళవారం ఓవర్నైట్ స్కోరు 112/5తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టు 140 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 146 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ని 1-1తో సమం చేసింది.
3..4 టెస్టులకు భారత జట్టిదే, మయాంక్, పాండ్యాలకు చోటు
పేస్, బౌన్స్కి అతిగా అనుకూలిస్తుందంటూ అతి ప్రచారంతో
వాస్తవానికి పెర్త్లో నూతనంగా నిర్మించిన ఆప్టస్ స్టేడియం పేస్, బౌన్స్కి అతిగా అనుకూలిస్తుందంటూ ఆస్ట్రేలియా అతిగా ప్రచారం చేసింది. దీనికి తోడు పిచ్పై పచ్చిక ఉండటంతో.. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ అనుకూలం అని టీమిండియా భావించింది. కానీ.. తొలిరోజే ఆటగాళ్ల పాద ముద్రలతో పిచ్ గరుకుగా మారిపోయి.. అస్థిర బౌన్స్తో పాటు స్పిన్నర్లకి సహకారం లభించింది.
రవీంద్ర జడేజాని పక్కన పెట్టడమే
పిచ్ స్పిన్నర్లకి కూడా అనుకూలించే అవకాశమున్నా.. ఇలా రవీంద్ర జడేజాని పక్కన పెట్టడం టీమిండియాని దెబ్బతీసిందంటూ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 8/106 గణాంకాలతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవడం గమనార్హం.
జడేజాని తీసుకోవాలనే ఆలోచనే రాలేదు.
‘పెర్త్ పిచ్ని పరిశీలించిన తర్వాత.. నలుగురు ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే చాలు అనుకున్నా. రవీంద్ర జడేజాని తీసుకోవాలనే ఆలోచనే రాలేదు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒక స్పిన్నర్ని తుది జట్టులో ఆప్షన్గా ఉంచుకోవాలనే ఆలోచనే లేకుండాపోయింది. డిసెంబరు 26 నుంచి జరగనున్న మెల్బోర్న్ టెస్టులో తప్పిదాలను దిద్దుకుని కచ్చితంగా జట్టుని గెలిపించే ప్రదర్శన చేస్తాం' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.