రుతురాజ్ విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(4) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. రొమారియో షెఫెర్డ్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. అయ్యర్ కూడా జోరు పెట్టడంతో పవర్ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 43 రన్స్ చేసింది.
వరుస ఓవర్లో..
పవర్ ప్లే అనంతరం వాల్ష్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ఔట్గా వెనుదిరగ్గా.. చేజ్ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఇషాన్ సైతం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్సర్తో జోరు కనబర్చగా.. రోహిత్ శర్మ(15 బంతుల్లో 7) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. డ్రేక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్తో కలిసి సూర్య ధాటిగా ఆడాడు.
|
సిక్సర్లతో సూర్య వీరవిహారం..
స్లాగ్ ఓవర్లలో ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుపడటంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. డ్రేక్స్ వేసిన 19వ ఓవర్లో సూర్య ఓ భారీ సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా,.. వెంకటేశ్ అయ్యర్ రెండు బౌండరీలు బాదాడు. దాంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. షెఫెర్డ్ వేసిన చివరి ఓవర్లో సూర్య మూడు భారీ సిక్సర్లతో 21 పరుగులు వచ్చాయి. దాంతో భారత్ 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆఖరి బంతికి సూర్య క్యాచ్ ఔటయ్యాడు.