పాక్ ఓపెనర్తో..
టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపిన పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ను ఓపెనర్లుగా ఎంపిక చేసిన హర్షాభోగ్లే.. ఫస్ట్ డౌన్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ మిచెల్ మార్ష్కు అవకాశం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్లో సత్తా చాటిన ఆటగాళ్లకే హర్ష ప్రాధాన్యత ఇచ్చాడు. ఐపీఎల్, బీబీఎల్, పీఎస్ఎల్ లీగ్ పెర్ఫామెన్స్ను కూడా పరిగణలోకి తీసుకున్నాడు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ, ఐదో స్థానంలో గ్లేన్ మ్యాక్స్వెల్ను తీసుకున్నాడు. ఐపీఎల్లో మ్యాక్సీ ఆర్సీబీ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
ఆల్రౌండర్లకే ప్రాధాన్యత..
ధనాధన్ ఫార్మాట్ కావడంతో హర్షా.. పూర్తిగా ఆల్రౌండర్లకే ప్రాధన్యత ఇచ్చాడు. ఆరో స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ ఆండ్రీ రస్సెల్ను తీసుకున్న హర్షా.. ఏకైక స్పిన్నర్గా రషీద్ ఖాన్ను ఎంచుకున్నాడు. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది, సౌతాఫ్రికా పేస్ గన్ అన్రిచ్ నోర్జ్తో పాటు టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాలను పేసర్లుగా ఎంచుకున్నాడు.
ఈ బెస్ట్ ఎలెవన్తో పాటు మరో నలుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసిన హర్షా.. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గూసన్, శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా, ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోలకు చోటిచ్చాడు. టీ20 ప్రపంచకప్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన డేవిడ్ వార్నర్కు చోటు దక్కకపోవడం విశేషం.
హర్షా భోగ్లే టీ20 ప్లేయింగ్ ఎలెవన్..
మహమ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లేన్ మ్యాక్స్వెల్, ఆండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, అన్రిచ్ నోర్జ్, జస్ప్రీత్ బుమ్రా
రిజర్వ్ ప్లేయర్స్: కేఎల్ రాహుల్, లూకీ ఫెర్గూసన్, వానిందు హసరంగా, జానీ బెయిర్ స్టో