|
దేశవాళీ టోర్నీలో మెరిసి..
అయితే మార్చికి ముందు డీవై పాటిల్ టీ20 టోర్నీలో శతకాలతో విరుచుకుపడ్డ పాండ్యా లాక్డౌన్ ముందు సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలనుకున్నాడు. కానీ తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. మిగత రెండు వన్డేలు కరోనాతో ఆగిపోయాయి. దీంతో పాండ్యా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ గ్యాప్లో ప్రియురాలు నటాషా స్టాన్ కోవిచ్ను పెళ్లి చేసుకున్నాడు.. తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ఉన్న పాండ్యా ఐపీఎల్లో చెలరేగేందుకు సిద్దమవుతున్నాడు.
గ్రాండ్ రీఎంట్రీ కోసం..
తాజాగా ముంబై ఇండియన్స్ వన్ ఫ్యామిలీ షోలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ప్రస్తుతం బంతిని చక్కగా బాదుతున్నా. నేనిప్పుడున్న శారీరక, మానసికంగా ప్రశాంతం ఉన్నా. ఈ పరిస్థితుల్లో పూర్వ వైభవం అందుకోవడం సులువైన పనే. ఆటకు ఎంతకాలం దూరమైనా ఫర్వాలేదు. నా పునరాగమనం విలువైందిగానే ఉంటుంది. ఆట కోసం నేను చాలా చక్కగా సిద్ధమయ్యాను. సానుకూలంగా ఉన్నాను. ఐపీఎల్ను నేనెంతో ఆస్వాదిస్తాను. ఘనంగా పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా' అని హార్దిక్ అన్నాడు.
గాయాలు సహజం..
'జీవితంలో గాయలెప్పుడూ మనతోనే ఉంటాయని తెలుసుకున్నాను. గాయపడాలని ఎవరూ కోరుకోరు. అయితే అలా జరగకుండా ఉండదనేది సత్యం. గాయాలెప్పుడూ ఒకడుగు ముందుకేసుందుకే నాకు ప్రేరణనిస్తాయి. లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ కోసం ఇబ్బందులేమీ పడలేదు. మా ఇంట్లో జిమ్ ఉండటంతో నేనూ, నా సోదరుడు కృనాల్ పాండ్యా రోజూ కసరత్తులు చేశాం. కోలుకున్న తర్వాత డీవై పాటిల్ ఆడటం అదృష్టం. జీవితంలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయని అనిపిస్తోంది' అని పాండ్యా ఆశాభావం వ్యక్తం చేశాడు.