క్రికెట్ ఏబీసీలు తెలియవు..
‘పీసీబీలోని ఏ ఒక్క అధికారికీ క్రికెట్ గురించి అవగాహన లేదు. కనీసం క్రికెట్కు సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. బోర్డు వ్యవహారాలను ప్రధాని ఇమ్రాన్ పట్టించుకోవడంలేదు. పీసీబీలోని పరిస్థితులపై ఇమ్రాన్ ఖాన్తో వ్యక్తిగతంగా మాట్లాడతా. దేశంలో క్రికెట్ దుస్థితికి కారకులైన వారిని వదలను. విదేశాల నుంచి ఓ వ్యక్తి (వసీమ్ ఖాన్)ని తీసుకొచ్చారు. దోచుకొని పారిపోతే అతడిని మీరు పట్టుకోగలరా? పాక్లో ఎంతోమంది ఉండగా అతడే కావాల్సి వచ్చాడా? దేశ పౌరులు ఎదగాలి. నిజంగా మెరుగైన వ్యక్తులు లభించకపోతేనే బయటకు చూడాలి. కానీ అలా జరగడం లేదు' అని మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆలస్యం కాకముందే..
ఇక క్రికెట్ గురించి తనకొక్కడికే అంతా తెలుసునని ఇమ్రాన్ భావిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డిపార్ట్మెంటల్ క్రికెట్ను రద్దుచేయడం మూలంగా యువ క్రికెటర్లకు ఉపాధి లభించడం లేదని మియాందాద్ అన్నాడు. దేశ భవిష్యత్తు వారేనని స్పష్టం చేశాడు. డిపార్ట్మెంటల్ క్రికెట్ను కొనసాగించాలని తాను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. ఆలస్యం కాకముందే పీసీబీని చక్కదిద్దాలని మియాందాద్ ఇమ్రాన్కు సూచించాడు.
విర్రవీగుతున్నావు..
‘నేను నీ కెప్టెన్. కానీ నువ్వు నా కెప్టెన్ కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీ గురించి మాట్లాడుతా. సారథిగా నిన్ను నేను ప్రోత్సహించా. కానీ నువ్వు మాత్రం ఓ దేవుడులా ఫీలవుతున్నావు. దేశంలోనే నీ అంత ఇంటిలిజెంట్ లేడని విర్రవీగుతున్నావ్. మరెవరూ ఆక్సఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇతర యూనివర్సిటీలో చదివనవారు లేరనుకుంటున్నావ్. ముందు ప్రజల గురించి ఆలోచించు. దేశం గురించి పట్టించుకో. దమ్ముంటే నిన్ను ప్రధాని చేయడంలో నా పాత్ర లేదని చెప్పు. దేశంలోని సాధారణ ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తున్నా. నేను నా ఫీల్డ్ వేరే అయినా.. ప్రపంచం గురించి ఆలోచిస్తాను. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతా.'అని ఇమ్రాన్పై మియాందాద్ ధ్వజమెత్తాడు.
ఇక పాక్ తరఫున 124 టెస్ట్లు, 233 వన్డేలు ఆడిన మియాందాద్.. సంప్రదాయక ఫార్మాట్లో 8832 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో 8 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 7381 రన్స్ చేశాడు.
IPL 2020: బీసీసీఐ సరికొత్త ప్లాన్.. రూ. 300 కోట్లు టార్గెట్!