వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్గా..
మొన్న పుట్టపర్తిలో ప్రత్యక్షమైన ఈ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్.. తాజాగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్గా అవతారమెత్తాడు.
సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే మహీ.. శుక్రవారం ఓ స్టన్నింగ్ ఫొటోతో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఓ పులి ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి.. దానికి ‘పులిని ఫొటోలు తీయడానికి అది ఎక్కువ సమయం ఇవ్వదు. దొరికిన సమయంలోనే కెమెరాను క్లిక్మనిపించాలి. కన్హా పార్క్ను సందర్శించడం అద్భుతంగా ఉంది'అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోగ్రాఫర్గా తాను తీసిన ఫొటోనని మహీ చెప్పకనే చెప్పాడు.మధ్య ప్రదేశ్లోని ఈ కన్హా పార్క్ను జనవరిలో ధోని తన కుటుంబ సభ్యులతో సందర్శించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్క్ను అతను విజిట్ చేయడం ఇదే తొలిసారని ఆ పార్క్ వెబ్సైట్ పేర్కొంది. చార్డెడ్ ప్లేన్లో ధోని అక్కడు వెళ్లినట్లు సమాచారం.
పుట్టపర్తిలో భారత మాజీ కెప్టెన్
ఇటీవల ధోని అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ధోని వ్యక్తిగత డాక్టర్ ముత్తు.. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాలను ట్రస్ట్ సభ్యులు వివరించిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులు.. అతన్ని ఘనంగా సన్మానించారు.
హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ వదులుకో : మాజీ క్రికెటర్
రాహుల్ రాకతో సైడ్ ట్రాక్..
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీపింగ్ గ్లౌవ్స్ అందుకోవడంతో ధోని భవితవ్యంపై జరిగిన చర్చ సైడ్ ట్రాక్ అయింది. ఆస్ట్రేలియా సిరీస్లో పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌవ్స్ను అందుకున్న రాహుల్.. ఆ సిరీస్లో బ్యాట్తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణించాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తన పెర్పామెన్స్ మరో లెవెల్కు తీసుకెళ్లాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. వన్డే సిరీస్లో కూడా బ్యాటింగ్, కీపింగ్లో మెరిసాడు.
ఐపీఎల్తో పునరాగమనం..
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్తో ధోని రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ సారథి అయిన ఈ జార్ఖండ్ డైనమెట్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక ధోని భవితవ్యం ఐపీఎల్తో తేలనుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మహీ టీమిండియాకు ఆడినా ఆడకపోయినా.. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడుతాడని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ ఇదివరకే స్పష్టం చేసారు.