|
మాస్క్లపై టీమిండియా అవగాహన..
అందుకే ఈ విషయంపై అవగాహన పెంచేందుకు టీమిండియా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కొందరు కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఎవరి ఇళ్లలో వారుంటూనే ఈ వీడియోలో పాలుపంచుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని, అలాగే సొంతంగా తయారు చేసుకున్న మాస్క్లని వాడండంటూ ఇందులో సందేశం ఇచ్చారు.
స్టార్ క్రికెటర్లంతా..
‘ఇప్పుడు మనమంతా టీమ్ మాస్క్ ఫోర్స్గా ఏర్పడదాం. ఎవరి మాస్కులు వారే తయారు చేసుకుని ధరిద్దాం' అంటూ ముందుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సందేశం ఇవ్వగా ఆ తర్వాత సొంతంగా తయారు చేసుకున్న మాస్క్లను ధరిస్తూ సౌరవ్ గంగూలీ, స్మృతి మంధాన, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, హర్మన్ప్రీత్, రాహుల్ ద్రావిడ్, సెహ్వాగ్, మిథాలీ రాజ్ కనిపించగా ఆఖర్లో సచిన్తో ఈ వీడియోను ముగించారు.
మాస్క్ తయారీ చాలా సులువు..
‘కమాన్ ఇండియా.. సొంతంగా మాస్క్లు తయారు చేసుకొని మాస్క్ ఫోర్స్లో భాగమవుదాం. అలాగే 20 సెకండ్లపాటు చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం మాత్రం మరచిపోవద్దు'అని సచిన్ విజ్ఞప్తి చేశాడు. ఇక ఈ మాస్క్ఫోర్స్లో భాగమవ్వడం చాలా సులువని ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇంట్లో కూర్చోని నేను తయారు చేసుకున్న మాస్క్లా అందరూ చేసుకోవచ్చని సూచించాడు.
బెదిరిస్తే బెదరడానికి నేనేం జైరా వసీంని కాను: బబితా ఫోగాట్
|
ప్రధాని టాస్క్..
ఈ వీడియోను ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి'అనే క్యాప్షన్తో బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ రోజు అందరు చేయాల్సిన అతిముఖ్యమైన టాస్క్ టీమ్ మాస్క్ ఫోర్స్లో భాగమవ్వడమని, జాగ్రత్తలే మనందరిని భద్రంగా ఉంచుతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై అందరికి అవగాహన కల్పించాలని కోరారు.