— Cow Corner (@CowCorner9) October 3, 2020 |
ఇంతకేం జరిగిందంటే..
రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతి సైనీ చేతిలో నుంచి జారి హైయర్ ఫుల్ టాస్గా 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ బంతిని తెవాటియా స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతను వేగంగా బ్యాట్ను ఊపడంతో బంతి నేరుగా వచ్చి అతని చాతిని తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన తెవాటియా ఒక్కసారిగా మైదానంలో కూలిపోయాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్గా ప్రకటించగా.. ఫ్రీహిట్ను తెవాటియా భారీ సిక్సర్ కొట్టి తన గాయం మాములేనని తెలియజేశాడు. అనంతరం మరో భారీ సిక్సర్ కొట్టడంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.
మహిపాల్ ఒక్కడే..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాడు మహిపాల్ లోమ్రోర్(39 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 47)రాణించగా.. చివర్లో ఆర్చర్(16 నాటౌట్), రాహుల్ తెవాటియా(24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/24) మూడు వికెట్లతో చెలరేగగా.. ఇసురు ఉడానా(2/41) రెండు వికెట్లు తీసాడు. సైనీకి ఒక వికెట్ దక్కింది.
కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీ..
అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 158 పరుగులు చేసి 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ దేవ్దూత్ పడిక్కల్(45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 63) తన ఫామ్ను కొనసాగించాడు. ఈ సీజన్లో పడిక్కల్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.