టోక్యో: ఎన్నో ఆశలు పెట్టుకున్న టెన్నిస్లో భారత్ను పరాజయం పలకరించింది. మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా-అంకితా రైనా జంట ఓటమి పాలైంది. కనీసం ప్రతిఘటించకుండా ఓటమిపాలు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఒకప్పుడు మెరుపులు మెరిపించిన సానియా మీర్జా.. ఇప్పుడు తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదనేది ఈ మ్యాచ్తో తేలిపోయింది. గుజరాత్కు చెందిన అంకితా రైనాతో జతకట్టి డబుల్స్ ఆడిన సానియా మీర్జా ఆమెను సమన్వయపర్చుకోవడంలో విఫలమైంది. అంకితా రైనాకు ఇదే తొలి ఒలింపిక్స్.
ఇంకో పతకానికి అతి చేరువగా: ఒక్క విజయం చాలు: ఆ జోడీ..సెమీస్లో ఎంట్రీ
విమెన్స్ టెన్నిస్ డబుల్స్ కేటగిరీ తొలి రౌండ్లో ఉక్రెయిన్కు చెందిన కవల పిల్లలు లిడ్మిలా విక్టోర్వినా కిచెనొక్, నాదియా విక్టోర్వినా కిచెనొక్ జంట 6-0, 6-7 (8-10) తేడాతో సానియా మీర్జా-అంకితా రైనాలపై ఘన విజయాన్ని అందుకుంది. తొలి సెట్లో కిచెనొక్లపై అద్భుతంగా ఆధిపత్యాన్ని సాధించింది సానియా మీర్జా-అంకిత రైనా జోడీ. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆ సెట్ను 6-0 తేడాతో గెలుచుకుందంటే భారత జంట దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే వేగాన్ని రెండో సెట్లో కొనసాగించలేకపోయింది. రెండో సెట్లో ఎల్ కిచెనొక్, ఎన్ కిచెనొక్ ఆట గాడిలో పడింది. సానియా-అంకితాలపై ఆధిపత్యాన్ని కనపరిచారు.
టైబ్రేక్ వరకు వెళ్లిన ఈ సెట్లో సానియా-అంకితా రైనా జోడీ శక్తిసామర్థ్యాలన్నీ హరించిపోయినట్టు కనిపించింది. కిచెనొక్ సిస్టర్స్ ఈ సెట్లో బౌన్స్ బ్యాక్ అయిన తీరు అద్భుతం. తొలి సెట్ను సున్నాతో కోల్పోయిన ఈ కవల పిల్లలు.. మెరుపువేగంతో కోలుకున్నారు. తమ ఆటను గాడిలో పెట్టారు. దూకుడుగా ఆడారు. ఎదురు దాడితో సానియా-అంకితా రైనాలను ఉక్కిరిబిక్కిరికి గురి చేశారు. మ్యాచ్ను టైబ్రేక్ వరకూ తీసుకెళ్లారు. ఫలితాన్ని నిర్దేశించే కీలకమైన టైబ్రేకర్లో సానియా-అంకితా నిస్సారంగా ఆడారు. ఫలితంగా- తమ చేజేతులా మ్యాచ్ను ప్రత్యర్థులకు ధారపోసినట్టయింది. ఈ ఓటమితో మహిళల డబుల్స్ టెన్సిస్లో ఫైనల్కు వెళ్లే ద్వారాలు మూసుకుపోయినట్టయింది.