ముంబై: లీగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్ జట్టు అదరగొట్టింది. అంచనాలను అందుకుంటూ తొలి మ్యాచ్లో సూపర్ విజయాన్ని సాధించింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు యోధాస్ 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్ గన్స్ను ఓడించింది. తెలుగు టీమ్ 48 పాయింట్లు చేయగా.. చెన్నై 38 పాయింట్లకే పరిమితమైంది. స్టార్టింగ్ నుంచే పక్కా ప్లాన్తో ఆడిన తెలుగు టీమ్ ప్లేయర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో 29-15తో ముందంజ వేశారు.
Poetry in motion ✍️
— Ultimate Kho Kho (@ultimatekhokho) August 14, 2022
With just ✌️ seconds to go, @TeluguYoddhas managed to get 2⃣ more points and put @ChnQuickGuns under pressure, was our #MomentofTheMatch 😎#CQGvTY #UltimateKhoKho #IndiaMaarChalaang #AbKhoHoga #KhoKho pic.twitter.com/p7Y1dVlAcl
అయితే రెండో ఇన్నింగ్స్లో చెన్నై వరుసగా పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. తెలుగు ప్లేయర్లను కట్టడి చేస్తూ 23-19 లీడ్లో నిలిచింది. ఓవరాల్గా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలుగు టీమ్ 10 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. డిఫెండర్ దీపక్ మాధవ్, అటాకర్ అరుణ్ గున్కీ రాణించి తెలుగు యోధాస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. తెలుగు యోధాస్ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్ పాయింట్లు, 17 డైవ్ పాయింట్లు ఉండటం విశేషం.
6⃣ teams, 1⃣4⃣3⃣ players, 1⃣ mission 👉 to take Kho Kho forward 👏
— Ultimate Kho Kho (@ultimatekhokho) August 14, 2022
Kuch aisa tha nazara jab aagaaz hua #UltimateKhoKho ke pehle season ka 🤩#IndiaMaarChalaang #AbKhoHoga #KhoKho pic.twitter.com/FuUCFSF1WH
ఈ మ్యాచ్కు ముందు జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 25 పాయింట్ల తేడాతో ముంబై ఖిలాడిస్ను ఓడించింది. గుజరాత్ 69 పాయింట్లు సాధించగా.. ముంబై 44 పాయింట్లే చేసింది. ఈ ఫ్రాంచైజీ ఆధారిత ఈ లీగ్ను సీఈవో, కమిషనర్ టెన్జింగ్ నియోగి.. భారత ఖోఖో ఫెడరేషన్ ప్రెసిడెంట్ నుదాన్షు మిట్టర్ ప్రారంభించారు. ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో రాజస్థాన్ వారియర్స్తో ముంబై ఖిలాడీస్, ఒడిషా జగర్నాట్స్తో చెన్నై క్విక్ గన్స్ తలపడనున్నాయి.