హోరాహోరీగా..
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్లో ఏడు రైడ్ పాయింట్స్ సాధించిన తెలుగు టైటాన్స్ 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించింది. ఇక బెంగాల్ మాత్రం 8 రైడింగ్, 6 ట్యాకిల్ పాయింట్లతో 14-13తో ఒక్క పాయింట్ లీడ్ సాధించింది. ఇరు జట్లు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. సెకండాఫ్లో కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. 8 రైడ్, 4 ట్యాకిల్, 2 ఎక్స్ట్రా పాయింట్స్తో తెలుగు టైటాన్స్ 14 పాయింట్లు సాధించగా.. బెంగాల్ వారియర్స్ కూడా 8 రైడ్, 2 ట్యాకిల్, 2 ఆలౌట్, 2 ఎక్స్ట్రా పాయింట్స్తో 14 పాయింట్సే సాధించింది.
కీలక సమయంలో ఆలౌటై...
అయితే ఫస్టాఫ్లో సాధించిన లీడ్తో బెంగాల్ వారియర్స్ విజయాన్నందుకుంది. ఆఖరి క్షణంలో తప్పులు చేసిన తెలుగు టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. 24-24తో స్కోర్లు సమంగా ఉన్నప్పుడు ఆలౌటవ్వడం తెలుగు టైటాన్స్ కొంపముంచింది. దాంతో మూడు పాయింట్స్ ఆధిక్యంలోకి వెళ్లిన బెంగాల్.. ఆఖరి వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్నందుకుంది. విజయం కోసం ఎదురు చూసిన తెలుగు అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
పాయింట్స్ టేబుల్లో అట్టడుగున..
ఈ మ్యాచే కాదు.. తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో దాదాపు అన్నీ ఇలా ఉత్కంఠగా ముగిసినవే. ఇందులో రెండు మ్యాచ్లు టై అవ్వగా.. మరో 8 మ్యాచ్ల్లో ఓటమే ఎదురైంది. ఒక్క విజయం కూడా నమోదు చేయని తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో యూపీ యోధా 50-40తో పుణేరీ పల్టాన్ను ఓడించింది.