హైదరాబాద్: నాలుగు దేశాల హాకీ టోర్నీలో భారత్కు కొద్దిలో విజయం చేజారింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన రెండో ఇన్నింగ్స్ ఫైనల్లో భారత్ షూటౌట్లో బెల్జియం చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Take a look at the snapshots from India’s tough loss against Belgium in the Final of the second leg of the Four Nations Invitational Tournament on 28th January.
— Hockey India (@TheHockeyIndia) January 28, 2018
ALBUM: https://t.co/a8WaV383lK#IndiaKaGame pic.twitter.com/xOtuOzwTR2
అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కానీ, నిర్ణీత సమయానికి రెండు జట్లు 4-4 గోల్స్తో సమంగా నిలిచాయి. దీంతో భారత జట్టు సిల్వర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
The second leg of the Four Nations Invitational Tournament in NZ comes to a thrilling conclusion on the final day as both games were decided by penalty shoot-outs. Here are the results of the games that took place on 28th January.#IndiaKaGame pic.twitter.com/dlJLN9sdVV
— Hockey India (@TheHockeyIndia) January 28, 2018
భారత్ తరఫున రమణ్దీప్ రెండు గోల్స్ (29వ, 53వ) కొట్టగా.. నీలకంఠ (42వ), మన్దీప్ (49వ) చెరో గోల్ సాధించారు. బెల్జియంలో జట్టు కోసిన్స్ (41వ), చార్లియర్ (43వ), క్యుస్టెర్స్ (51వ), డెనాయర్ (56వ) తలో గోల్ కొట్టారు. షూటౌట్లో బెల్జియం 3-0తో గెలిచింది.
ఇదే రోజున జపాన్కు న్యూజిలాండ్కు జరిగిన మ్యాచ్లో 4-1తేడాతో జపాన్ గెలిచింది. దీంతో జపాన్ జట్టు కాంస్యాన్ని దక్కించుకుంది. తర్వాత జరిగిన ఫైనల్లో భారత్, బెల్జియం జట్లు పోటీ పడ్డాయి. మ్యాచ్ ఒకానొక పరిస్థితిలో 52 సెకండ్ల పాటు జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో బెల్జియం జట్టు ముగ్గురు ఆటగాళ్లు గోల్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వారు చేసిన గోల్ను భారత గోల్ కీపర్ చాకచక్యంగా ఆపగలిగాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.